Skip to main content

"మోక్షా'' మీరాజాస్మిన్‌



మీరాజాస్మిన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హర్రర్‌ చిత్రం "మోక్షా''. ఈ చిత్రానికి వేములపల్లి శ్రీకాంత్‌ దర్శకత్వం వహించగా, అమర్‌నాథ్‌ మూవీస్‌ పతాకంపై డి. అమర్‌నాథ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ రంగంలో వున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... "ఇది హర్రర్‌ చిత్రం. కొత్త ఆలోచనలతో వాణిజ్య అంశాలు మేలుకలయికగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. మీరాజాస్మిన్‌ ఎంతో వైవిధ్యపరమైన పాత్రలో నటిస్తున్నారు. రాజీవ్‌మోహన్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు'' అని వివరించారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్‌ 15 వరకు హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది

Comments